Thursday, November 19, 2015

కృతజ్ఞతా నమస్సులు

శుభోదయం, సహస్ర కవి సమ్మేళనం లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతా నమస్సులు. శ్రీ మాన్ మేక రవీంద్ర గారికి, గోగులపాటి కృష్ణ మోహన్ గారికి సహకరించిన పెద్దలందరికీ పేరుపేరునా వందనాలు. అందరినీ ఒకే వేదికపై తీసుకవచ్చి మాకొక గుర్తింపు కలిగించారు. మీ మేలును మరువము. మీకు కృతజ్ఞతగా వెలసిందొక ఆటవెలది.

తెలుగు భాష ఘనత తేజరిల్లునిజము
వేయి కవుల తోడి వేదికయ్యె
పూనుకొన్న వారు పుణ్యాత్ములేనయ్య
వందనంబు జేతు నొందవేలు.

మరొక సందర్భం కొరకు ఎదురుచూస్తూ.... మాచర్ల మల్లేశం, sk no 745. గోదావరిఖని, కరీంనగర్ జిల్లా.

No comments:

Post a Comment