Monday, October 30, 2017

అమ్మలార.. అయ్యలార .. ఆలోచించండి జర



అమ్మలార అయ్యలార
ఆలోచించండి.. జర

రచన : గోగులపాటి కృష్ణమోహన్
సూరారంకాలని, హైదరాబాదు.

అమ్మలార... అయ్యలార
ఆలోచించండి జర
మీ బిడ్డల భవిష్యత్తు
మీ చేతుల్లోనే ఉంది.
అనవసరపు ఆశలతో
ఆసక్తులు లేపకండి..
ఇరుగు పొరుగు పిల్లలతో
పోటీలు పెట్టకండి
ఇంజనీర్లు డాక్టర్లే
అవ్వాలని అనకండి
ర్యాంకులు రాలేదంటూ
రాద్దాంతం చేయకండి
లక్షల్లో పిల్లలుంటె
వేలల్లవకాశాలు
ఎంతచదివితేముంది
అందని ద్రాక్షనిపండ్లు
వారిలోని ఆసక్తిని
గ్రహించాలి మీరంతా
ఎందులొ నైపుణ్యముంటె
అందులోనే రాణించ
వారిలో ఉత్సాహాన్ని
నింపాలి మీరంతా
చదవలేక... చెప్పలేక
చచ్చిపోయె దానికన్న
బతికి సాదించండని
బాగుగా బతుకండని
మీ పిల్లలకు మీరె
భరోసా ఇవ్వండి
మీ పిల్లల్లోన మీరె
ధైర్యాన్ని నింపండి..‌
భావితరాలను మనం
బతికించుకోవాలి
బంగారు భవితను
వారికందించాలి


మీ
సహస్రకవిరత్న
కవి ప్రవీణ
గోగులపాటి కృష్ణమోహన్
కవి, సీనియర్ జర్నలిస్టు
9700007653

విద్యార్థుల ఆత్మహత్యలు ఆపండి



ఆత్మహత్యలు ఆపండి
గోగులపాటి కృష్ణమోహన్
సూరారంకాలని, హైదరాబాదు

విద్యార్థుల ఆత్మహత్యలపై..
మానసిక వేదనతో 

తల్లడిల్లే పిల్లలారా
చదువుకొరకు చిదపకండి
మీ లేత జీవితం‌..
చదువన్నది ఒక్కటే
జీవితం కాదండీ.
చదువు లేని వారెందరో
బాగుపడ్డ వారున్నరు..
చదువన్నది ఒక్కటే
శాశ్వతం కాదండీ
చదువులేకున్న కూడ
శాశ్వతంగా బతకవచ్చు
చదువు కొరకు ప్రాణాలను
అర్పించే ముందు మీరు
మీ తల్లి తండ్రులను
గుర్తెరిగి మలుచుకోండి
చదువుకున్న వారికంటే
చదువు లేనివారెందరొ
తెలివిని ఉపయోగించి
ప్రయోజకులు అవుతున్నరు
ఇంజనీర్లు డాక్టర్లే
ఇంటింటికీ కావాలా?
ఇతరులు ఎవ్వరు మనకు
అవసరమే లేరా?.
చదువన్నది సంస్కారం
చదువన్నది మేదస్సు
చదువన్నది విజ్ఙానం
కా కూడదది అజ్ఙానం
చావకండి చావకండి
విద్యార్ధిని విద్యార్థులారా
సాధించే దేమిలేదు
సచ్చినాక మీరింకా
బతుకండి బతుకండి
నీవారికోసం... నీ ఊరికోసం
బతకండి బతకండి
బతికి సాదించండి

మీ
సహస్రకవిరత్న
ప్రతిలిపి-కవిప్రవీణ
గోగులపాటి కృష్ణమోహన్
కవి, సీనియర్ జర్నలిస్టు
9700007653

Monday, October 9, 2017

ప్రతిలిపి కవి ప్రవీణ


                                         ప్రతిలిపి కవి ప్రవీణ పురస్కారం అందుకున్న గోగులపాటి కృష్ణమోహన్






ప్రతిలిపి కవి ప్రవీణ పురస్కారం అందుకున్న గోగులపాటి కృష్ణమోహన్
------------------------------------------------------
కవి, సీనియర్ జర్నలిస్టు గోగులపాటి కృష్ణమోహన్ కు ప్రతిలిపి సంస్థ ప్రతిలిపి కవి ప్రవీణ, ప్రతిలిపి కథాభారతి బిరుదులను అందజేశారు
దేశంలోని వివిధ బాషలలో సాహిత్య సేవలందిస్తూ ఎంతో మందికవులకు సోషల్ మీడియా ద్వారా వేదికగా నిలిచిన ప్రతిలిపి సంస్థ తమ సంస్థతో అనుసంధానం అయిన కవులు/రచయుతల పట్టాభిషేకంలో బాగంగా విశేష ప్రతిభ కనబరిచి మరియు తెలుగు సాహిత్యానికి కృషి చేస్తున్నందుకు గాను విజయవాడలోని ఐ ఎమ్ ఏ హాల్లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో పలువురు కవులకు పురస్కారాలను అందజేసింది.
ఇందులో బాగంగా 200 లకు పైగా పద్యాలు, కవితలు, కార్డు కతలు అందించిన గోగులపాటి కృష్ణమోహన్ సాహితీ సేవలను గుర్తించి ప్రతిలిపి కవిప్రవీణ, ప్రతిలిపి కథా భారతి అనే బిరులను ప్రధానంచేసింది.
ఇప్పటికే సహస్ర కవిరత్న, సహస్ర కవిమిత్ర బిరుదులు పొందడంతో పాటు రెండు రికార్డు కవిసమ్మేళనాలలో పాల్గొని తన ప్రతిభను చాటుకున్నాడు గోగులపాటి కృష్ణమోహన్.
కార్యక్రమంలో ముఖ్య అతిధిగా, తెలుగు రక్షణ వేదక అద్యక్షులు పొట్లూరి హరికృష్ణ, దూరదర్శన్ వాఖ్యాత విజయదుర్గ, ఆం. ప్ర. మహిళా కమీషన్ సభ్యురాలు డా. రాజ్యలక్ష్మి, ప్రముఖ కవయిత్రి అత్తలూరి విజయలక్ష్మి, కళ్యాణ్ కృష్ణ కరణం, ప్రతిలిపి తెలుగువిభాగం ఇంచార్జ్ జానీ తక్కెడశిల, భువనవిజయం వ్యవస్థాపకులు వంకాయలపాటి చంద్రశేఖర్, చిత్రకారుడు కుంచె లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.