Tuesday, November 1, 2016

బతుకమ్మ పురస్కారం




జాతీయ తెలుగు కవుల సమ్మేళనం లో పాల్గొన్న సీనియర్ జర్నలిస్టు గోగులపాటి కృష్ణమోహన్ కు బతుకమ్మ పురస్కారం


 "సహస్రకవిమిత్ర" గోగులపాటి కృష్ణమోహన్ తెలుగు రక్షణ వేదిక ఆధ్వర్యంలో  నిర్వహించిన "జాతీయ తెలుగు కవుల సమ్మేళనం" లో పాల్గొని బతుకమ్మ పండుగ ప్రాశస్త్యం తెలిపే కవిత చదివి బతుకమ్మ కవితోత్సవం మరియు పురస్కారాన్ని అందుకున్నారు.

అక్టోబర్ 23, 2016 ఆదివారం నాడు కరీంనగర్ పట్టణంలోని ప్రెస్ భవన్ లో
తెలుగు రక్షణ వేదిక ఆధ్వర్యంలో  "జాతీయ తెలుగు కవుల సమ్మేళనం" జరిగింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా జరిగిన ఈ జాతీయ తెలుగు కవి సమ్మేళనంలో దేశం నలుమూలల నుండి నవ,యువ,మహా కవులు రచయితలు పెద్దసంఖ్యలో పాల్గొని  బతుకమ్మ పండుగ విశిష్టతను తెలిపేలా, మన  సంస్కృతి సంప్రదాయాల గురించి మరియు తెలుగు భాష, యాస, వ్యవహారికాలకు సంబంధించిన కవితలు, గేయాలు, జానపదాలు తదితర రచనలను కవులు తమ కవనాల ద్వారా తెలియజేశారు.

ఈ సంధర్భంగా పాల్గొన్న కవులందరిని నిర్వాహకులు శాలువాలతో సన్మానించి, ప్రశంసా పత్రాలను అందజేశారు.

ఈ సందర్బంగా కృష్ణమోహన్ మాట్లాడుతూ సమాజంలో అన్ని అంశాలపై స్పందించే వారు కవులని, నేటి తరం కూడా సాహిత్యం పై మక్కువ పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలుగు రక్షణ వేదిక జాతీయ అధ్యక్షులు పొట్లూరి హరికృష్ణ,    తెలుగు రక్షణ వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బొడ్డు మహేందర్,  పలువురు కవులు పాల్గొన్నారు.



No comments:

Post a Comment