Tuesday, May 8, 2018

జలకవితా మహోత్సవం - వనపర్తి

తేది 06-05-2018, ఆదివారం నాడు వనపర్తి జిల్లా కేంద్రం లోని పాలిటెక్నిక్ మైదానంలో  తెలంగాణ రచయితల సంఘం, తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో తెలంగాణా జలకవితోత్సవం ఘనంగా నిర్వహించారు.
 అద్భుతంగా జరిగిన "తెలంగాణ జల కవితోత్సవం" లో  తెలంగాణా లోని పలుప్రాంతాలనుండి అనేకమంది కవులు పాల్గొని తరలంగాణాలో నీటి వనరులు - చాటి ప్రాధాన్యత గురించి తమ తమ కవితల, పద్యాల ద్వారా వివరించారు. 

ఇందులో బాగంగా మేడ్చల్ జిల్లా, సూరారంకాలని కి చెందిన కవి, సీనియర్ జర్నలిస్టు గోగులపాటి కృష్ణమోహన్ పాల్గొని " తెలంగాణ జలకళ - అదేకదా మనకల" అనే కవిత ద్వారా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీరిచ్చి ఇండ్లలో జలకల,  మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్లో పూడికలు తీసి చెరువుల్లో జలకల, ప్రాజెక్టు నిర్మాణాలు చేసి కాలువల్లో జలకళ తీసుకువచ్చిన ఘనతను తన కవిత ద్వారా వినిపించి తొఇటి కవుల, నిర్వాహకుల ప్రశంసలు అందుకున్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గోగులపాటి కృష్ణమోహన్ ను  ఘనంగా సత్కరించారు.










No comments:

Post a Comment